amp pages | Sakshi

ఇప్పుడు పరీక్షలా? 

Published on Sat, 08/29/2020 - 01:36

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ తీవ్రమవుతున్న సందర్భంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు పెట్టడం ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. వెం టనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రు ల్లోని గందరగోళానికి తెరదించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలో జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. గాంధీభవన్‌లో జరిగిన ధర్నా లో పాల్గొన్న ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు. కరోనా అదుపులోకి వచ్చే వరకు పరీక్షలను మరో ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేస్తే నష్టం లేదని అన్నారు. వాయిదా వేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనను కొనసాగిస్తుందని చెప్పారు. కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న పరిస్థితిలో జేఈఈ, నీట్‌ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదన్నారు.  

భారీగా పోలీసుల మోహరింపు 
 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న ఆయకార్‌ భవన్‌ ముందు ధర్నా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. కానీ, గాంధీభవన్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకున్నాయి. దీంతో ఉత్తమ్‌ సహా పలువురు అక్కడే ధర్నాకు దిగా రు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, ఆడమ్‌ సంతోష్, మైనారిటీ విభాగం చైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా సోహై ల్, ఫిరోజ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షలన్నింటినీ వాయి దా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎస్‌యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ గాంధీ భవన్‌లో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా, పలువురు కాంగ్రెస్‌ నేతలు సంఘీభావం తెలిపారు.  

Videos

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)