amp pages | Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు..

Published on Tue, 01/31/2023 - 15:18

బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన వయసు 80 ఏళ్లని ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు.  బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈమేరకు ప్రకటన చేశారు.

అయితే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని యడియూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీజేపీని మరోసారి అధికారంలోకి తెస్తానని పేర్కొన్నారు.

రాష్ట్రానికే పరిమితం..
అలాగే తనకు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, కర్ణాటకకే పరిమితం అవుతానని యడ్డీ స్పష్టంచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తనను కేంద్రానికి రమ్మని అప్పుడే అడిగారని, కానీ తాను మాత్రం సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు.

తన ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారని, రాష్ట్ర నలుమూలలు తిరిగి బీజేపీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారని యడ్డీ వివరించారు.

140 సీట్లు ఖాయం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 140  స్థానాల్లో విజయం సాధిస్తుందని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. రెండు సార్లు సర్వే చేసిన తర్వాత గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని చెప్పారు.

ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగలాండ్, త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
చదవండి: నా శవం కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో వెళ్లదు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)