amp pages | Sakshi

ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర.. కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ

Published on Wed, 08/03/2022 - 01:12

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న కేంద్రం, ఇప్పుడు గ్రామీణ పేద కూలీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నంలో ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం గతనెల 18న సర్క్యులర్‌ జారీ చేసిందని, దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ పథకాన్ని అవినీతి పేరుతో రద్దు చేసే కుట్రలను విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... 

రూ.10వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో..
కేంద్రం కుట్ర వల్ల దేశంలోని కూలీలకు, తెలంగాణలోని 1.21 కోట్ల మంది ఉపాధి హామీ కూలీల హక్కులకు భంగం కలుగబోతోంది. దేశవ్యాప్తంగా రూ. 10వేల కోట్ల వేతనాలు పెండింగ్‌ ఉన్నాయని స్వయాన కేంద్ర మంత్రి ఇటీవల రాజ్యసభలో చెప్పారు. 2022–23 కేంద్ర బడ్జెట్లో ఉపాధి హమీ పథకానికి రూ. 73 వేల కోట్లే కేటాయించారు. ఇందులో 18,380 కోట్లు గతేడాది బకాయి వేతనాలకే పోగా, మిగిలిన నిధులు ఏ మూలకు సరిపోతాయి. 

8 గంటలు పనిచేస్తే.. రూ. 257 ఇస్తారా? 
కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌లో కూలీలు ఉదయం 10లోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకోసారి ఫోటోలు దిగి అప్‌లోడ్‌ చేయాలని ఉంది. ఎండాకాలంలో 8 గంటలు పని చేయడం ఎలా సాధ్యం? ఉదయం, సాయంత్రం హాజరు తప్పనిసరి చేయడం కూలీలను అవమానించడమే. రూ.257తో నిజంగా జీవనోపాధి లభిస్తుందా? 17 ఏళ్ల నుంచి పథకం అమలవుతుంటే... కొత్త బ్యాంకు అకౌంట్లు తీయాలని కూలీలను వేధిస్తూ వేతనాలు చెల్లించడంలో కేంద్రం ఆలస్యం చేస్తోంది. కూలీలు తమ శ్రమతో దేశ సంపద పెంచుతుంటే, ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలి.  

బీజేపీ ప్రతినిధులకు అధికారం కోసమే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన ఫస్ట్‌ రన్నరప్‌ను ఈ పర్యవేక్షణలో భాగం చేయాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రన్నరప్‌ అనే పదాన్ని వాడడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. అధికారుల పనిని ఎన్నికల్లో ఓడిన వారికి అప్పగించడంలో మతలబేంటి? ఓడిన మీ పార్టీ ప్రతినిధులకు అధికారం కట్టబెట్టేందుకే ఈ నిర్ణయమని అర్థమవుతోంది.

ఉపాధి హామీ ద్వారా ఒక గ్రామంలో 20 పనులే చేపట్టాలని కేంద్రం చెప్తోంది. దీనివల్ల కూలీలకు పనులు ఎంపిక చేసుకునే అవకాశం సన్నగిల్లి, ఉపాధికి దూరమవుతారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ బిడ్డగా మీరెలా సమర్థిస్తారు?    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌