amp pages | Sakshi

రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? 

Published on Sun, 07/17/2022 - 02:18

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏ పథకాలను అమలు చేశారో చెప్పాలన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన ట్వీట్‌పై కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే ఏ రాష్ట్రంలో, ఎన్ని లక్షల మంది రైతులకు లాభాల పంట పండి వారి ఆదాయం రెట్టింపు అయిందో చెప్పాలన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రచార పోస్టర్‌లో ఉన్న రైతు ఓ మోడల్‌ అని నెటిజన్లు తేల్చారని కేటీఆర్‌ గుర్తుచేశారు.

నిజంగానే మోదీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే ఆ విషయాన్ని అసలైన రైతులతో చెప్పించాలి కదా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం నకిలీ వార్తలతో దేశ ప్రజలను మోసం చేస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్న విషయాన్ని ఉటంకించారు. 

ఇదేనా మీ భాష? 
పార్లమెంటులో మాట్లాడకూడని పదాల (అన్‌పార్లమెంటరీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చిన దేశ ప్రజలను ‘ఆందోళన్‌ జీవి’అని సాక్షాత్తు ప్రధాని మోదీ అనొచ్చు. ‘గోలీ మారో సాలోం కో’అని ఒక కేంద్ర మంత్రి రెండు వర్గాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టొచ్చు. అధికారం కోసం సమాజంలో చీలిక తెచ్చేలా ‘80–20’అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు.

జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే ఏం ఫర్వాలేదు. దేశానికి అన్నం పెట్టే రైతులను ‘టెర్రరిస్టులు’అని పిలిస్తే కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓకే. ఇవన్నీ బీజేపీ సారథ్యంలోని కేంద్రంలో పనిచేస్తున్న నాన్‌ పర్ఫార్మింగ్‌ అస్సెట్‌ (ఎన్‌పీఏ) ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన పదాలు’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.   

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)