అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘కష్టాల్లో ఉన్నప్పుడే నందమూరి కుటుంబం గుర్తుకువస్తుంది’
Published on Sun, 02/26/2023 - 14:56
సాక్షి, తిరుపతి: నారా లోకేష్ పాదయాత్రకు జనాలు రావడానికి భయపడుతుంటే, ఆ యాత్రను చూసి యువత పారిపోతోందని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పాదయాత్రలో కనీసం పదిమంది నాయకులు కూడా లేరని, అది ఫెయిల్యూర్ యాత్ర అని మండిపడ్డారు రోజా.
తిరుపతిలో సాక్షి టీవీతో మాట్లాడిన ఆర్కే రోజా.. ‘ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబం గుర్తుకు రాలేదు. కష్టాల్లో ఉన్పప్పుడే చంద్రబాబుకు నందమూరి కుటుంబం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు, లోకేష్లు పార్టీని లాక్కున్న దొంగలు... పార్టీ పెట్టిన వ్యక్తి మనవడిని లోకేష్ ఆహ్వానించడం దారుణం. చంద్రబాబు, లోకేష్, పవన్ వల్ల ఉపయోగం లేదని అర్థం అవుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ను పిలుస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
#
Tags