amp pages | Sakshi

మిత్రులకు దోచిపెట్టే పనిలో మోదీ

Published on Sat, 09/04/2021 - 02:45

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ లూటీ చేయడంలో భాగంగా వాటిని అమ్మేసి తన మిత్రులకు దోచిపెట్టడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం జాతి సంపదను తెగనమ్మేస్తోందని ధ్వజమెత్తారు.

ఒకరోజు హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ, మల్లురవి, దాసోజు శ్రావణ్, పొన్నం ప్రభాకర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

అచ్ఛేదిన్‌ అంటే జాతి సంపదను అమ్మడమా! 
దేశానికి అచ్ఛేదిన్‌ రాబోతున్నాయని మోదీ చెబుతూంటారని, జాతి సంపదను అమ్మివేయడమే అచ్ఛేదిన్‌ రావడమా అని ఖర్గే ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రపంచ దేశా లకు ధీటుగా మెరుగుపర్చడమే లక్ష్యంగా నాడు నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువచ్చారన్నారు.

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కోసం పబ్లిక్, ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించారని చెప్పారు. కానీ మోదీ ప్రభు త్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగం కుప్పకూలితే రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని, ఈ విధంగా రిజర్వేషన్లను ఎత్తివేసేందుకే మోదీ ప్రభుత్వం పరోక్షంగా పనిచేస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలోని పేదలు మరింత పేదలుగా మారిపోతారని చెప్పారు. 

సంపత్‌ ఇంట్లో అల్పాహారం 
ఖర్గేకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డితో పాటు నేతలు సంపత్‌కుమార్, మల్లురవి, హర్కర వేణుగోపాల్‌ స్వాగతం పలికారు. సంపత్‌ నివాసంలో ఖర్గే అల్పాహారం చేశారు. పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి, మరికొందరు ఖర్గేను కలిశారు. గీతారెడ్డి, అద్దంకి దయాకర్‌లతో పాటు ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్‌ ఖర్గేను కలిసి రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, సీఎం కేసీఆర్‌ ఆ వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)