amp pages | Sakshi

మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి

Published on Wed, 09/15/2021 - 14:49

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్ ఏడున్నర ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అవినీతి పెరిగిపోయిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే దానిపై ఫిర్యాదు చేసేందుకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. ఈనెల17వ తేదీన రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాను ఎంపీ, ఎమ్మెల్యేలతో తాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. నూటికి 90 శాతం తాగుబోతులను చేస్తోందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శించారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోందని, ఆ మద్యంమత్తులోనే దారుణ సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్‌

మహిళలపై జరిగే దాడులకు కారణం మద్యమేనని పోలీసుల రికార్డులు చెబుతున్నాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 2021లో ఇప్పటివరకు 1,750 రేప్ కేసులు జరిగాయని వెల్లడించారు. అత్యంత పాశవిక సంఘటనలు జరగడానికి మద్యం, డ్రగ్స్ కారణమని వివరించారు. సింగరేణి కాలనీలో ఘటనపై వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ ఎలా చేశారు? అని ప్రశ్నించారు. ఐదు రోజుల తర్వాత పరారీలో ఉన్నాడని పట్టుకుంటే రూ.10 లక్షల రివార్డు ప్రకటించారని చెప్పారు. అదుపులోనే ఉన్నాడని కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? అని నిలదీశారు. విషసంస్కృతికిపై నిఘా విభాగాలు సీఎం కేసిఆర్ నివేదికలు ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు. డ్రగ్స్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 9 దర్యాప్తు సంస్థలకు తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు స్పందించకుంటే ప్రజాప్రయోజనాల వాజ్యం వేసినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.
చదవండి: ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘లేపాక్షి’ ఉత్పత్తులు

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)