amp pages | Sakshi

అధికారంలోకి వస్తామని కల కంటున్నారా? 

Published on Fri, 12/11/2020 - 15:20

సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు దేవినేని ఉమ, పరిటాల సునీత, శ్రీరామ్‌లు మూడు రిజర్వాయర్ల శంకుస్థాపనకు రాజకీయ రంగు పులుముతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హంద్రీ నీవా పనులు ప్రారంభించారని, జీడిపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో చేపట్టారని చెప్పారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకి నీళ్లు ఇవ్వాలని తాను, అనేక మంది రైతులు కోరామని, అప్పటి సీఎం వైఎస్సార్‌ను కలిసి నివేదించామని తెలిపారు. ఆ వెంటనే స్పందించిన వైఎస్సార్ 2009 ఎన్నికల సభలో పేరూరు డ్యాంకు నీరిస్తామని ప్రకటించారన్నారు. ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. శుక్రవారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికలకి ముందు ఏడాది 2018లో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎన్నికలకు ఒక నెల ముందు పనులు ప్రారంభించారు. పేరూరు డ్యాంకి పైసా ఖర్చు లేకుండా నీరివ్వవచ్చని చెప్పినా పట్టించుకోలేదు. ఆనాడు అంచనాలు పెంచుకుని దోచుకునే ప్రయత్నం చేశారు.

మేము అధికారంలోకి వచ్చాక విచారణ చేయించాము. 200 కోట్ల రూపాయల మిగులు కనిపించింది. ఆ నిధులతో మరొక రిజర్వాయర్ చేపట్టాము. వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. దేవినేని ఉమా చిత్తశుద్ధితో మాట్లాడాలి. అంచనాలు పెంచుకున్నప్పుడు మీరెక్కడికి వెళ్లారు. దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?. సీఎం జగన్‌ నిధులు దుర్వినియోగం కాకుండా కరువు ప్రాంతానికి నీరిస్తున్నారు. ఆయన లక్ష ఎకరాలకు నీళ్లిస్తున్నారు. మీరు శంకుస్థాపనలు చేసిన వాటిని మా వైఎస్సార్ ముందుకు నడిపించారు. రాయలసీమకు సాగు నీరు అందించే దిశగా మేము ముందుకి వెళ్తున్నాం. పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైంది. అది ఏ విధంగా పరిటాల రవి కల అవుతుంది?’’ అని ప్రశ్నించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)