amp pages | Sakshi

హిందీని బలవంతంగా రుద్దొద్దు.. కేంద్రానికి స్టాలిన్ లేఖ

Published on Mon, 10/10/2022 - 19:13

చెన్నై: హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని కేంద్రానికి లేఖ రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అది భాషాయుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ నిలయమని, అన్ని భాషలను సమానంగా చూడాలని సూచించారు. దేశంలోని అన్ని భాషలను అధికారిక భాషలుగా గుర్తించే స్థాయికి మనం చేరుకోవాలని పేర్కొన్నారు. భారత సమగ్రతను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లేఖలో పేర్కొన్నారు.

దేశంలోని ఐఐటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు హిందీలో పాఠాలు బోధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిన మరునాడే స్టాలిన్ లేఖ రాశారు. మాతృభాషను ఆరాధించే ఏ రాష్ట్రమైనా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

'హిందీ దివస్' సందర్భంగా హిందీ అధికారిక భాష అని అమిత్ షా చెప్పిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. దేశంలోని మెజారిటీ విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు హిందీ మాట్లాడరని అన్నారు. హిందీ మాట్లాడేవారిని ఫస్ట్ క్లాస్ సిటిజెన్లుగా, మాట్లాడని వారిని సెకండ్ క్లాస్ సిటిజెన్లుగా చూస్తే అది కచ్చితంగా 'విభజించు పాలించు' విధానమే అవుతుందని వ్యాఖ్యానించారు.

మరో దక్షిణాది రాష్ట్రం కేరళ కూడా హిందీని బలవంతంగా రుద్దొద్దని ఇప్పటికే స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, దేశంలో భాషా వైవిధ్యానికి ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. భారత వైవిధ్యాన్ని బీజేపీ ఎప్పుడూ విశ్వసించదని కేరళ మాజీ మంత్రి టీఎం థామస్ విమర్శించారు. 'ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే దేశం' అనే ఆర్‌ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)