amp pages | Sakshi

కేంద్రం దిగివచ్చేదాకా ఉద్యమిస్తాం: కేటీఆర్‌

Published on Sat, 11/13/2021 - 03:35

సిరిసిల్ల:  కొట్లాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోరని, కేంద్రం దిగి వచ్చేదాకా ఉద్యమిస్తారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు  పేర్కొన్నారు. దేశాన్ని 75 ఏళ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పీకింది ఏంటీ.. అని ప్రశ్నించారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (ఆకలి సూచిక)లో మన దేశం 101వ ర్యాంకులో ఉంటే, మనకంటే చిన్న దేశాలైన పాకిస్తాన్‌ 92వ ర్యాంకులో, నేపాల్, బంగ్లాదేశ్‌లు 76 ర్యాంకుల్లో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీ పాలన సిగ్గు చేటని పేర్కొన్నారు. రైతుల ఉత్సాహం చూస్తుంటే  రాష్ట్ర సాధన ఉద్యమం గుర్తుకు వస్తోందన్నారు. యాసంగి వడ్లను కొనబోమన్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నాను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. 

పేదరికంపై సోయి లేదు: దేశంలో సాగుకు యోగ్యమైన 40కోట్ల ఎకరాల భూములున్నాయని, 65 వేల టీఎంసీల నీరుందని, సాగుకు, తాగునీటికి ఎంత వాడుకున్నా.. 35 వేల టీఎంసీలకు మించదని మంత్రి వెల్లడించారు. ఇంత సారవంతమైన భూములున్నా, మంచి వాతావరణం ఉన్నా, దేశంలో పేదరికం పోలేదని కేటీఆర్‌ విమర్శించారు. దేశాన్ని నడిపేవాళ్లకు ఆ సోయి లేదని అన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ఆ విషయం గూగుల్‌లో చూస్తే తెలుస్తుందని చెప్పారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. 

కేంద్రం కొంటానంటే వద్దంటున్నామా?: కేంద్రం యాసంగి వడ్లు కొనబో మని చెబితే.. ఎన్నోసార్లు సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కలిసి బాయిల్డ్‌ వడ్లు కొనాలని కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. అయినా కేంద్ర వైఖరి మారకపోవడంతో యాసంగిలో వరి వద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారని.. వెంటనే తొండి సంజయ్‌ వడ్లు ఎట్ల కొనరో చూస్తానని అన్నారని మంత్రి చెప్పారు. కేంద్రం వడ్లు కొం టామంటే మేం వద్దంటున్నామా..? అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ ఏం అభివృద్ధి సాధించాడో చెప్పాలని అన్నారు.

రైతులకు తెలంగాణలో నీళ్లు ఇచ్చి, కరెంట్‌ ఇచ్చి, పెట్టుబడికి పైసలిచ్చి, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చి.. రైతుకు ఆపద వస్తే బీమా కల్పించి ఏడేళ్లుగా సీఎం కేసీఆర్‌ రైతుల కుటుంబాలకు అండగా ఉంటున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అంటే.. తెలంగాణ రైతు సమితి అని కేటీఆర్‌ అన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే.. రైతుల ఎడ్ల బండి కింద బీజేపీ నలిగిపోతుందన్నారు. కేంద్రమంత్రి కొడుకు కారుతో రైతులను తొక్కించి 8 మందిని చంపితే.. ప్రధాని  సంతాపం కూడా చెప్పలేదని విమర్శించారు.  

Videos

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)