amp pages | Sakshi

బియ్యం ఎగుమతులపై నిషేధం.. రైతులకు శాపం

Published on Sun, 09/11/2022 - 02:24

సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: బియ్యం ఎగుమ­తులపై సుంకాన్ని, నూకల ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారుతోందని ఆర్థిక, వైద్యా­రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తలాతోక లేని నిర్ణయాలు రైతులను ముంచి కార్పొరేట్‌లకు పంచేలా ఉన్నాయని మండిపడ్డారు.

శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి పటాన్‌చెరులో జరిగిన సభలో మాట్లాడారు. దేశంలో ఆహార నిల్వలు తగ్గినప్పుడు మాత్ర­మే ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తారని, ఇప్పుడు కేంద్రం ఎందుకు నిషేధం విధిస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రక­టించిన బీజేపీ.. ఎరువులు, విత్తనాల ధరలను పెంచి రైతుల పెట్టుబడులను రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు.

దేశంలో నాలుగేళ్లకు సరి­పడా బియ్యం నిల్వలున్నా­యని, వడ్లు కొనేదిలేదని చెప్పిన కేంద్రమంత్రి ఇప్పుడు బియ్యం ఎగుమతులపై సుంకాలను విధించ­డం ఏంటని ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు, చైనా, పాకిస్తాన్‌ వంటి దేశా­ల్లో కరువు ఏర్పడిందని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణ మాత్రం దక్షిణ భార­తదేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 75 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేదని, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 65 లక్షల ఎకరాల వరి సాగ­వుతోందని హరీశ్‌ వివరించారు. కార్యక్రమంలో మెద­క్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)