amp pages | Sakshi

మానవత్వం కూడా లేదా?

Published on Tue, 09/14/2021 - 03:28

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి, హత్యకు గురైతే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లేకుండాపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన బంధువు తండ్రి మరణిస్తే ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శించిన కేసీఆర్‌ బాలిక కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు.

దొరలకో న్యాయం, దళిత, గిరిజనులకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇక్కడి సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని రేవంత్‌ సోమవారం పరామర్శించారు. దేవరకొండ, ఎల్బీనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబానికి రేవంత్‌ చేతుల మీదుగా రూ.1.5 లక్షలను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఘటన జరిగితే ఆయనగానీ, సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మంత్రి కేటీఆర్‌గానీ, నగర మంత్రులుగానీ ఎందుకు స్పందించటం లేదన్నారు.

నిందితుడ్ని పట్టుకోవడం పోలీసులకు చేతకావట్లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు మంత్రి కేటీఆర్, మద్యానికి సీఎం కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా, గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలానికి చెందిన సామాజిక కార్యకర్త గుజ్జుల మహేష్‌.. రేవంత్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరారు.   

కేసీఆర్‌ గుండెల్లో దడపుట్టించాలి 
‘సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నిర్వహించబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవసభ ఆరంభం మాత్రమే. గజ్వేల్‌ను కొల్లగొట్టాలి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు దండుకట్టి దండోరా మోగించి కేసీఆర్‌ గుండెల్లో దడపుట్టించాలి’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బలవంతుడు కాదని, నక్కజిత్తుల మనిషి అని విమర్శించారు.

 సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏడున్నరేళ్లుగా సీఎం కేసీఆర్‌ చేతిలో దళితులు, గిరిజనులు దగా పడుతూనే ఉన్నారన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన కేసీఆర్‌.. ఆ విగ్రహం పెట్టకపోగా కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ తెచ్చిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని మండిపడ్డారు. దీనిపై వీహెచ్‌ పోరుకు పార్టీ మద్దతు ఉంటుందని, గజ్వేల్‌ సభలో దీనిపై తీర్మానం చేస్తామన్నారు. 

ఇందిరను గెలిపిస్తే పరిశ్రమలొచ్చాయి 
గతంలో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీని అక్కడి ప్రజలు గెలిపిస్తే పెద్దసంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని, లక్షల మందికి ఉపాధి కలిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ జలాశయాల్లో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జలసమాధి అయ్యా యి. కేసీఆర్‌కు ఇవన్నీ తెలియాలంటే గజ్వేల్‌ సభను లక్షమందికి తగ్గకుండా నిర్వహించాలి. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం రావాలంటే గజ్వేల్‌ కోటను బద్దలుకొట్టాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

కేడర్‌లో నమ్మకం వస్తోంది: జానారెడ్డి 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్‌కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఏడేళ్లుగా కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఉందని మధుయాష్కీగౌడ్‌ అన్నారు.

గజ్వేల్‌ సభను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్, సంభాని చంద్రశేఖర్, జాఫర్‌ జావేద్, జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)