amp pages | Sakshi

ధరల నియంత్రణకు చర్యలేవి?

Published on Thu, 08/04/2022 - 04:36

సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసర ధరల నియంత్రణపై కేంద్రం చర్యలు ఆశాజనకంగా లేవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ధరలను నియంత్రించే చర్యలేమిటని, ప్రత్యామ్నాయ మార్గాలపై చేస్తున్న ఆలోచనలు ఏమిటని ప్రశ్నించింది. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొడ్డేటి మాధవి, బీశెట్టి సత్యవతి, గురుమూర్తి మాట్లాడారు. ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ధరల పెరగుదలకు కారణాలు చెప్పిన కేంద్రం ఉపశమన చర్యలు మాత్రం ప్రకటించలేదని విమర్శించారు.

ఎంపీ భరత్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ ఒడుదొడుకులకు లోనైంది నిజమైనా.. పేదవాడి ఇబ్బందులు తీర్చడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులు, వంటనూనెల ధరల నియంత్రణలో వైఫల్యంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. కరోనా కారణంగా రెండేళ్లలో భారీగా ఆదాయం కోల్పోయిన పరిస్థితుల్లో కేంద్రం విప్లవాత్మకమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీడీపీ 8.9 శాతం నుంచి 7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని సూచించారు.

ముఖ్యంగా సోలార్, పునరుత్పాదక ఇంధన వనరులు, హైడ్రో ఎలక్ట్రిక్‌ విద్యుదుత్పత్తులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇస్తే ప్రాజెక్టును పూర్తిచేసి 960 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా పామాయిల్‌ వంటి సరుకులను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్‌లోనే వాటి ఉత్పాదకత పెరిగేలా రైతులకు పంట ప్రోత్సాహకాలు ప్రకటించాలని, ఎంఎస్‌పీని సవరించాలని కోరారు. టీటీడీపై జీఎస్టీని తొలగించాలన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.18 వేల కోట్ల రెవెన్యూ లోటును కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.
  
ఉపశమన చర్యలేవి? 
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కేంద్ర ఆర్థికమంత్రి కారణాలు చెప్పారే తప్ప పరిష్కార మార్గాలు చెప్పలేదని విమర్శించారు. పీఎం ఉజ్వల యోజన కింద 2లక్షల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్‌ ధరను రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచితే లాభమేమిటని ప్రశ్నించారు. ఒకపక్క ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే సహకార మార్కెట్‌లలో అమ్మే స్థానిక ఉత్పత్తులపైనా జీఎస్టీ విధించడం ఏమిటని నిలదీశారు. పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవన్నారు. కేంద్రం మానవతా దృక్పథంతో పేదలపై భారం తగ్గించాలని కోరారు.   

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)