సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
సమస్యలు స్థానికంగానే పరిష్కరించాలి
Published on Sat, 11/11/2023 - 02:02
టంగుటూరు: ప్రజల సమస్యలు స్థానికంగానే పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టంగుటూరులోని సీవీఆర్ కళ్యాణ మండపంలో ‘జగనన్నకు చెబుదాం’ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 67 అర్జీలు వచ్చాయన్నారు. స్పందనలో వచ్చిన అర్జీలను సహేతుకంగా, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపలేని పక్షంలో అందుకుగల కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని స్పష్టం చేశారు. అర్జీదారుల్లో సంతృప్త స్థాయి పెరిగేలా పిటిషన్లను పరిష్కరించాలని దిశా నిర్దేశం చేశారు. జయవరం పంచాయతీలో పనిచేస్తున్న క్లాప్మిత్రలు, పంచాయతీ కార్మికులు, రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆ గ్రామ సర్పంచి మల్లవరపు పేరమ్మ వినతిపత్రం అందించారు. అలాగే టంగుటూరు గ్రామంలో ప్రభుత్వం జారీ చేసిన ఈనాం భూమి మొత్తం 11 ఎకరాల పైగా ఉందని, అందులో ఆక్రమణలు తొలగించి మాదిగ ఈనాం యాక్టును అమలుచేయాలని జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యదర్శి బక్కా తిరుమలరావు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసరావు, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఎంపీడీఓ రత్నజ్యోతి, తహసీల్దార్ సంజీవరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
టంగుటూరులో ‘జగనన్నకు
చెబుదాం’ స్పందన
Tags