అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత మహిళలకు తొలి ఓటమి
Published on Sun, 01/24/2021 - 05:27
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా పర్యటనలో భారత సీనియర్ మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. శనివారం అర్జెంటీనా జూనియర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా తరఫున మ్యాచ్ 11వ నిమిషంలో సోల్ పాగెల్లా గోల్ చేయగా... 54వ నిమిషంలో సలీమా (భారత్) దాన్ని సమం చేసింది. అయితే మరో 3 నిమిషాల్లోనే గోల్ సమర్పించుకున్న భారత్ ఓటమి పాలైంది. మ్యాచ్ 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను అగస్టినా గోర్జెలానీ నేర్పుగా గోల్ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లు 2–2, 1–1తో డ్రాగా ముగిశాయి. తదుపరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
#
Tags