amp pages | Sakshi

10 కోట్లకు కొంటే ఆడలేదు.. ఇప్పుడేమో ఫేవరెట్‌!

Published on Thu, 02/18/2021 - 12:57

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిల్లియర్స్‌పై భారం తగ్గించేందుకు మాక్సీ వైపు మొగ్గు చూపుతుందని అభిప్రాయపడ్డాడు. చెన్నైలో గురువారం ఐపీఎల్‌-2021 మినీ వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘కొత్త కాంబినేషన్ల కోసం ఆర్సీబీ ప్రయత్నిస్తే బాగుంటుంది.  కోహ్లి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగితే బాగుంటుంది. దేవదత్‌ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాలి. ఏబీ వంటి హిట్టర్‌ ఎలాగో జట్టులో ఉన్నాడు. అయితే ఎప్పుడూ కోహ్లి, ఏబీపై ఆధారపడకూడదు. 

వారిపై కాస్త ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా యాజమాన్యం మాక్స్‌వెల్‌ వంటి ఆటగాడిపై సహజంగానే ఆసక్తి కనబరుస్తుంది. చిన్నస్వామి స్టేడియం ఫ్లాట్‌గా చిన్నదిగా ఉంటుంది. అలాంటి మైదానంలో మ్యాక్స్‌వెల్‌ ప్రభావం చూపగలడు. ఏదేమైనా జట్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేలం తర్వాతే తెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా బౌలింగ్‌ విభాగంలో ఉమేశ్‌ యాదవ్‌, మొయిన్‌ అలీ వంటి క్వాలిటీ ప్లేయర్స్‌ను రిలీజ్‌ చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. 

కాసుల వర్షం కురుస్తుందా!?
గతేడాది డిసెంబర్‌ 2019లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. అయితే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ దారుణంగా విఫలమయ్యాడు. 2020 సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్‌ ఫ్రాంఛైజీ అతడిని వదులుకోగా ప్రస్తుతం వేలంలోకి వచ్చాడు. ఇక మ్యాక్సీని సొంతం చేసుకునేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆసక్తి చూపడం విశేషం. ఒకవేళ ఇరు జట్లు పోటీ పడితే అతడిపై మరోసారి కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే! 
చదవండిశార్దూల్‌ స్థానంలో సీనియర్‌ సీమర్‌ జట్టులోకి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)