amp pages | Sakshi

పంత్‌ ఆడటంపై స్పష్టత లేదు: అయ్యర్‌

Published on Mon, 10/12/2020 - 16:29

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించి మరో గెలుపును నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆడలేదు. తొడ కండరాల గాయంతో పంత్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా, పంత్‌ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పష్టం చేశాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన అయ్యర్‌ను పంత్‌ గురించి అడగ్గా ఇంకా ఎటువంటి స్పష్టతా లేదన్నాడు. ‘ నాకైతే పంత్‌ అందుబాటులో ఉండటం గురించి తెలీదు. పంత్‌కు వారం రోజులు విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్పారు. (ఖలీల్‌పై రాహుల్‌ తెవాటియా ఫైర్‌ !)

త‍్వరలోనే జట్టులో చేరతాడని ఆశిస్తున్నా. అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అనేది మాత్రం నాకైతే తెలీదు. ఆ నిర్ణయం మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుంది’ అని తెలిపాడు. ఇక ఓటమి గురించి మాట్లాడుతూ.. ‘ మేము(ఢిల్లీ) 10 నుంచి 15 పరుగులైతే తక్కువ చేశాం. బోర్డుపై 170-175 పరుగులు ఉండి ఉంటే మ్యాచ్‌ మరొలా ఉండేది. ఆ కారణంగానే మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మరొకవైపు స్టోయినిస్‌ రనౌట్‌ కావడం కూడా ప్రభావం చూపింది. స్టోయినిస్‌ బంతిని బాగా హిట్‌ చేస్తున్నాడు. స్టోయినిస్‌ వికెట్‌ను రనౌట్‌ రూపంలో కోల్పోవడం మేము మ్యాచ్‌లో చేసిన తప్పిదం. ఇది ఫలితంపై ప్రభావం చూపింది’ అని అయ్యర్‌ పేర్కొన్నాడు.

నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ స్థానంలో రహానే తుది జట్టులోకి వచ్చాడు. దాంతో వికెట్‌ కీపర్‌గా అలెక్స్‌ క్యారీని తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చొబెట్టారు. పంత్‌ గాయం కారణంగా రహానే జట్టులోకి రావడం ఒకటైతే, విదేశీ ఆటగాళ్లు నలుగురికి మించి ఆడకూడనే నిబంధనతో హెట్‌మెయిర్‌ స్థానంలో క్యారీని కీపర్‌గా తీసుకోవాల్సి వచ్చింది. కాగా, క్యారీ నుంచి ఎటువంటి మెరుపు ఇన్నింగ్స్‌ రాలేదు. 9 బంతులాడి 14 పరుగులు చేసినా అవి సింగిల్స్‌, డబుల్స్‌ రూపంలోనే వచ్చాయి.  అదే పంత్‌ జట్టులో ఉండి ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవని, దాంతో మ్యాచ్‌పై పట్టుసాధించడానికి ఆస్కారం దొరికేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(69 పరుగులు‌: ధావన్‌పై నెటిజన్ల ఫైర్‌!)

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌