రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దక్షిణాసియా ఫుట్బాల్ టోర్నీకి సౌమ్య
Published on Tue, 08/30/2022 - 05:09
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నేపాల్ వేదికగా జరిగే దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టుకు సోమవారం పుణేలో ఐదురోజుల శిక్షణ శిబిరం మొదలైంది.
సెప్టెంబర్ మూడో తేదీన భారత జట్టు నేపాల్కు వెళుతుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో నేపాల్, భూటాన్, శ్రీలంక జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్ల నుంచి టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 19న ఫైనల్ జరుగుతుంది.
#
Tags