amp pages | Sakshi

ఫ్యాన్స్‌తో కళకళలాడుతున్న చెపాక్‌

Published on Sat, 02/13/2021 - 12:05

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు బీసీసీఐ 50 శాతం ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చెపాక్‌ స్టేడియం అభిమానులతో కళకళలాడుతుంది. దాదాపు ఏడాది విరామం తర్వాత భారత్‌లో మ్యాచ్‌ జరగడంతో మైదానంలో మ్యాచ్‌ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు.  50వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న చిదంబరం స్టేడియంలో 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో 15వేల మందికి మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఈ సందర్భంగా బీసీసీఐ వీడియోను రిలీజ్‌ చేసింది. 'చెన్నై స్టేడియానికి కొత్త కళ వచ్చింది. సుధీర్ఘ కరోనా విరామం తర్వాత మైదానంలో అభిమానులను చూడడం సంతోషంగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది.

తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫేస్‌ మాస్క్‌ ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించినట్లు తెలిపారు. అయితే  మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరు రూల్స్‌ పాటించడకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో మాత్రం ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 80 పరుగులతో దాటిగా ఆడుతుండడంతో లంచ్‌ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రహానే 5 పరగులతో రోహిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు కెప్టెన్‌ కోహ్లి, గిల్‌లు డకౌట్‌గా వెనుదిరగ్గా.. పుజారా 21 పరుగులు చేసి ఔటయ్యాడు.


Videos

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)