amp pages | Sakshi

రూ.36.73 కోట్లు జమ

Published on Thu, 05/25/2023 - 01:06

44,301 మంది తల్లుల ఖాతాల్లో

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 44,301 మంది తల్లుల ఖాతాల్లో రూ.36.73 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ వెల్లడించారు. 2022– 23 ఏడాదికి సంబంధించి రెండో విడత జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరెట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని నమూనా చెక్కును విద్యార్థులకు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులను త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ పలు అభివృద్ధి పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యార్థులు ద్రాక్షాయని, ఉదయ్‌, కల్యాణి, స్రవంతి, పవిత్రా మాట్లాడుతూ చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక స్థోమత లేకపోయిన వారికి విద్యాదీవెన వంటి పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఉమెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బల్లాడ హేమమాలిని రెడ్డి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, రాజాపు హైమావతి, సాంఘిక సంక్షేమ శాఖ (ఎఫ్‌.ఏ.సి) అధికారి గడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో జగనన్న విద్యాదీవెన కింద 49,165 మంది విద్యార్థులకు లబ్ధి

చెక్కు పంపిణీలో కలెక్టర్‌

శ్రీకేష్‌ బి.లాఠకర్‌ వెల్లడి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)