రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
తెలంగాణలో కొత్తగా 1,531 పాజిటివ్ కేసులు
Published on Fri, 10/30/2020 - 10:27
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1330కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ( భారత్లో కొత్తగా 48,648 కరోనా కేసులు )
నిన్న ఒక్క రోజే 1,048 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,17,401కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 15,425 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది.
Tags