amp pages | Sakshi

సీబీఐకి అనుమతులు ఉపసంహరించుకోవాలి

Published on Fri, 09/02/2022 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమె త్తారు. విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సీబీఐ, ఈడీలతో దాడులు చేయి స్తూ ఆ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్రం వైఖరితో ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాల ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ తరహా దాడులు ఆగాలంటే.. విచారణకు వీ లుగా సీబీఐకి ఇచ్చిన అనుమతులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సూచించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రా ల పరిధిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. బుధవారం బిహార్‌ రాజధాని పట్నాలో పర్యటించిన కేసీఆర్‌.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 

విస్తృత చర్చల తర్వాతే..
‘దేశంలోని విపక్ష పార్టీలను అంతమొందించి గుత్తాధిపత్యం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఒకవైపు బలహీనులను బెదిరిస్తూ సత్య హరిశ్చంద్రుని వారసుల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కుంభకోణాలకు పాల్పడటమే కాకుండా ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ డబ్బును బీజేపీ వెదజల్లుతోంది. దేశంలోని విపక్షాలన్నీ ఏకమై బీజేపీ ముక్త భారత్‌ను సాధిస్తేనే దేశ పురోగతి సాధ్యమ వుతుంది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి ముందుకు సాగుతాం. విస్తృత చర్చల అనంతరం ఎన్నికల సమయంలో ఈ శక్తికి ఎవరు నేతృత్వం వహిస్తారనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం’ అని కేసీఆర్‌ చెప్పారు. 

ధర్మం పేరిట దేశాన్ని చీల్చుతున్నారు..
‘ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలోని ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో లేనంతగా పడిపోయింది. గతంలో దేశం నుంచి మేధో వలస జరగ్గా, ఇప్పుడు పెట్టుబడిదారులు దేశాన్ని వీడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తిని అంతమొందించేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం వంటి చట్టాల పేరిట ఇబ్బందులు పెడుతున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు, బేటీ పడావో.. భేటీ బడావో వంటివి కేవలం నినాదాలకే పరిమితమవుతున్నాయి. ధర్మం పేరిట దేశాన్ని చీల్చుతూ అంతర్జాతీయ స్థాయిలో తలవంపులు తెస్తున్నారు. 

భిన్నంగా ఆలోచించాలి..
70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్‌ కొరత ఉంది. మేకిన్‌ ఇండియా అంటూ ఊదరగొడుతున్నా జాతీయ జెండాను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా దేశంలో నెలకొని ఉన్న సమస్యల నుంచి బయట పడేందుకు భిన్నంగా ఆలోచించాలి. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై సీఎం నితీశ్‌తో కూడా చర్చించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

పట్టుదలతో ముందుకు సాగండి: నితీశ్‌
తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపిన కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని బిహార్‌ సీఎం నితీశ్‌ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు భారత్‌కు మార్గదర్శకంగా నిలుస్తు న్నాయని అన్నారు. కేసీఆర్‌ గురించి అవగా హన లేనివారే తప్పుడు మాటలు మాట్లాడు తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవస రంలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు వదులు కోరంటూ.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టు దలతో ముందుకు కొనసాగాలని, మరింత శక్తి కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించాలని నితీశ్‌ సూచించారు.

లాలూతో కేసీఆర్‌ భేటీ
బుధవారం ఉదయం 12 గంటలకు బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమా నంలో పట్నాకు వెళ్లిన కేసీఆర్‌ కు.. తేజస్వీ యాదవ్‌  స్వాగ తం పలికారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత దేశ రాజ కీయాలు, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు. అనంతరం నితీశ్, తేజస్వీతో కలిసి కేసీఆర్‌ మీడియా భేటీలో ప్రసంగించారు. తర్వాత బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కలిసిన కేసీఆర్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం గురుగోవింద్‌ సింగ్‌ జన్మస్థలం పట్నా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్‌కు చేరుకు న్నారు. సీఎం వెంట బిహార్‌కు వెళ్లిన బృందంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు, తదితరులున్నారు. 

అమర వీరులు, కార్మికుల కుటుంబాలకు సాయం 
చైనాతో పోరాటంలో భాగంగా గాల్వాన్‌ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు, అలాగే సికింద్రాబాద్‌లోని ఓ టింబర్‌ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన బిహార్‌ కార్మికుల కుటుంబాలకు.. నితీశ్‌తో కలిసి కేసీఆర్‌ ఆర్థిక సాయం అందజేశారు. నితీశ్‌ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తేజస్వీ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సా యం చెక్కుల రూపంలో అందజేశారు. 

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)