amp pages | Sakshi

3,109 మందికి డెంగీ

Published on Tue, 08/23/2022 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లక్షణాలున్నవారి నుంచి శాంపిళ్లను సేకరించి వైద్య ఆరోగ్యశాఖ డెంగీ కేసులను గుర్తిస్తోంది. ఆ విధంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 32,449 నమూనాలను సేకరించి పరీక్షించింది. అందులో 3,109 మందికి డెంగీ (9.58% పాజిటివిటీ) నిర్ధారణ అయిందని పేర్కొంది.

ఈ మేరకు తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు. భారీ వర్షాలకు పట్టణాలు, పల్లెల్లో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో..:  అన్ని జిల్లాల్లోనూ డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా హైద రాబాద్‌లో 12,205 రక్త నమూనాలను పరీక్షించగా, అందు లో 1,470 మంది డెంగీ బారిన పడ్డారు. అంటే ఇక్కడ 12. 04 పాజిటివిటీ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 2,044 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 322 మందికి డెంగీ (15.75 శాతం పాజిటివిటీ) సోకింది.

మేడ్చల్‌ జిల్లాలో 1,375 నమూనాలకు గాను 165 మందికి, ఖమ్మం జిల్లాలో 3,815 మందికి గాను 126 మందికి, కరీంనగర్‌ జిల్లాలో 1,011 మందికి గాను 123 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 1,662 మంది నమూనాలను పరీక్షించగా 88 మందికి, ఆదిలాబాద్‌ జిల్లాలో 729 మంది నమూనాలను పరీక్షించగా, 81 మందికి డెంగీ సోకినట్లు తేలింది. కాగా రాష్ట్రంలో 378 మందికి మలేరియా, 44 మందికి చికున్‌గున్యా సోకింది. 

డెంగీ లక్షణాలివే..: ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపి తే నొప్పి పుడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. కండరా లు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. 

ప్లేట్‌లెట్‌ కౌంట్‌ ఒక్కటే సరిపోదు: డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్‌లెట్లు 20 వేల లోపునకు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు.

15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవి స్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడుస్తుండాలి. ఎల క్ట్రాల్‌ పౌడర్, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు అదుపులోకి వస్తాయి.

ముందు జాగ్రత్తలే మంచిది: దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. స్కూల్‌ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాలల పరిస రాలు శుభ్రంగా ఉంచాలి. కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్‌ ఫీవర్‌ అయితే మంచినీరు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)