amp pages | Sakshi

ఇక.. చూస్తుండగానే బూడిద!

Published on Thu, 08/13/2020 - 09:22

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌–19 మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 650కిపైగా మరణాలు నమోదయ్యాయి. కోవిడ్‌తో వ్యాధి తీవ్రమైన వారు ఎక్కువ మంది నగరానికే వస్తుండటం.. ఇక్కడ మరణించిన వారిని తిరిగి తమ స్వగ్రామాలకు తీసుకెళ్లలేక చాలామంది అంత్యక్రియల భారాన్ని ఆస్పత్రులపైనే వదిలివేస్తున్నారు. వీరి అంత్యక్రియలకు ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటమే కాక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం వీలైనన్ని దహన వాటికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న గ్యాస్‌ ఆధారిత దహన వాటికను గత నెలలో ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. పలు లోపాలుండటంతో వాటిని సరిచేస్తామని సంబంధిత ఏజెన్సీ తెలిపింది.

కానీ.. దానివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటాన్ని దృష్టిలో ఉంచుకొని విరమించుకున్నారు. ఢిల్లీ తదితర ఉత్తరాది నగరాల్లో వాడుతున్న దహనవాటికలను పరిశీలించిన అధికారులు అవి ఉపయోగకరంగా ఉన్నాయని భావించి అలాంటివి నాలుగు తెప్పించారు. ఒక్కో విద్యుత్‌ దహన వాటికకు దాదాపు రూ. 45 లక్షలు వ్యయం కాగా, అవసరమైన షెడ్డు, ఇన్‌స్టలేషన్‌ పనులు తదితరమైన వాటికి వెరసి రూ. 88 లక్షలవుతుంది. వీటిని చార్మినార్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం  ఆయా ప్రాంతాల్లో వాటి అమరిక పనులు జరుగుతున్నాయి. ఈ వారాంతంలోగా ఇన్‌స్టలేషన్‌ పనులన్నీ పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌తో పనిచేసే వీటికి ఒక్కో మృతదేహానికి ఒక గ్యాస్‌ సిలిండర్‌ సరిపోతుందని, దాదాపు 75 నిమిషాల్లో మృతదేహం దహనం అవుతుందని అధికారులు తెలిపారు. దహనం చేయాల్సిన మృతదేహాలు పెరిగే కొద్దీ.. ఈ సమయం 45 నిమిషాలకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. గతంలో మూతపడ్డ అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఎర్రగడ్డ శ్మశానవాటికల్లోని  విద్యుత్‌  దహన వాటికలను కూడా వినియోగంలోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌