సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
Breaking News
-----
Published on Mon, 11/20/2023 - 16:11
హైదరాబాద్: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీపీ కార్యాలయంలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. హుటాహుటిన హైదర్గూడ అపోలో ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
బషీర్బాగ్లో పాత కమిషనర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ శాండిల్య పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన కిందపడిపోయారు. వెంటనే అధికారులు ఆయన్ని హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. మరికొన్ని పరీక్షలు చేయాల్సి అవసరం ఉందని తెలిపారు.
ఇటీవలే హైదరాబాద్ సీపీగా శాండిల్య నియమితులయ్యారు. ఎన్నికల నేపథ్యంలో భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరనున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్
Tags