amp pages | Sakshi

వామ్మో.. ఆ నీళ్లు తాగితే డైరక్ట్‌ దవాఖానానే..

Published on Thu, 08/12/2021 - 08:47

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో భూగర్భజలం తీవ్రంగా కలుషితమైంది. పలు పరిశ్రమలు విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థజలాలను నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వట్టిపోయిన బోరుబావుల్లో వదిలివేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల్లో భారలోహాలు, నైట్రేట్‌లు, పాస్ఫరస్‌ తదితర మూలకాల ఉనికి కనిపించినట్లు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ప్రాథమిక అధ్యయనంలో తేలింది. పూర్తిస్థాయి నివేదిక ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి సిద్ధమవుతుందని ఆ సంస్థ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. 

భూగర్భ జల కాలుష్యానికి ప్రధాన కారణాలివే.. 
► మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాలు, చెరువుల నీటి నమూనాలను ఇటీవల ఎన్‌జీఆర్‌ఐ (జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ) సేకరించి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించింది. 
► ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్‌చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు, నైట్రేట్‌లు, పాస్ఫరస్‌ అధికంగా ఉండడంతోపాటు భార లోహాల ఉనికి బయటపడింది.   
►  పలు రసాయన, బల్‌్కడ్రగ్, ఫార్మా పరిశ్రమల నుంచి బహిరంగ ప్రదేశాలు, సమీప చెరువులు, నాలాలు, మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరడం. ఈ జలాలు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. 
►  రోజువారీగా గ్రేటర్‌లో 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో 700 మిలియన్‌ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు.  
►  మిగతా 700 మిలియన్‌ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండానే మూసీలో కలుస్తున్నాయి. 
► ఇందులో సుమారు 350 మిలియన్‌ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థజలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. 

భూగర్భజలాల్లో ఉన్నమూలకాలు, భారలోహాలివే.. 
సోడియం, క్యాల్షియం, మెగీ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్, నైట్రేట్, పాస్ఫరస్‌. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలశాఖ నెలవారీగా భూగర్భ జలమట్టాలను లెక్కిస్తోంది. ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో బోరుబావులు తవ్వి భూగర్భజలాల నాణ్యత ను ఎన్‌జీఆర్‌ఐ సౌజన్యంతో పరిశీలించనుంది. ఈ వివరాలను జీఐఎస్‌ మ్యాపుల్లో పొందుపరిచి భూగర్భజలశాఖ వెబ్‌సైట్‌లో అందరికీ లభ్య మయ్యేలా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఆ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి నగరంలో పారి శ్రామిక వాడలతోపాటు ఇతర ప్రాంతాల్లో భూ గర్భజలాల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదికను ఎన్‌జీఆర్‌ఐ సిద్ధం చేయనుందని వెల్లడించాయి.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్