amp pages | Sakshi

9 నుంచి 5 వరకు డ్యూటీలో ఉండాలి

Published on Wed, 04/06/2022 - 02:04

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలని చెప్పారు. పాము, కుక్క కాటు మందులు పీహెచ్‌సీల్లో ఉండాలని.. మందుల్లేక వైద్యం అందలేదని ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటు లో ఉండేలా చూసుకోవాలని, మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత ఆరోగ్య సమాచార వ్యవస్థలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్‌ చేయాలని.. టి–డయాగ్నొస్టిక్‌ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వోలు ఆకస్మిక తనిఖీలు చేసి పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. పీహెచ్‌సీల పనితీరుపై మంగళవారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందితో మంత్రి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

పీహెచ్‌సీలు ముఖ్యం 
ప్రజారోగ్య రక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) పాత్ర ప్రధానమైనదని మంత్రి అన్నారు. ప్రాథమిక స్థాయిలో వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు రాకుండా ప్రజలను కాపాడొచ్చని చెప్పారు. పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఇందుకు అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు ఎన్‌రోల్‌ చేసుకోవాలని మంత్రి సూచించారు. సాధారణ ప్రసవాలు పెంచాలని.. వైద్యులకు, నర్సులకు ప్రోత్సాహాకాలు ఇస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఉండి సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 30% ఇన్‌ సర్వీస్‌ కోటా కల్పించామని చెప్పారు.  

పీహెచ్‌సీల స్థానంలో కొత్త నిర్మాణాలు 
పాత పీహెచ్‌సీల స్థానంలో అవసరమైతే కొత్త నిర్మాణాలు చేపడతామని, మరమ్మతులు అవసరమున్న వాటిల్లో వెంటనే పనులు మొదలు పెడతామని, అందుకు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. డీఎంహెచ్‌వోలు, డిప్యూ టీ డీఎంహెచ్‌వోలు, ఇంజనీర్లు పరిశీలించి వారంలో ప్రతిపాదనలు పంపాలన్నారు. టెలి మెడిసిన్‌ విధానాన్ని  విస్తృతంగా వినియోగించుకొవాలని చెప్పారు.    

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)