వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్రిక్తత: భూమి విషయంలో గొడవ.. కొట్టుకున్న రెండు గ్రామాల రైతులు
Published on Fri, 11/18/2022 - 16:34
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుడికిల, నార్లాపూర్ గ్రామాల రైతులు పోడు భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు గ్రామాల రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం పదిమందికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాలకు ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పోడు భూముల సర్వే సందర్భంగా భూమి తమది అంటే తమది అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
#
Tags