అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి డబుల్ డోస్ వ్యాక్సిన్
Published on Sat, 06/19/2021 - 10:32
సాక్షి, రంగారెడ్డి: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అదే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం రేపుతోంది. ఓ నర్స్ నిర్లక్ష్యంతో ఓ యువతికి ఓకేసారి డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ఎస్లో చోటు చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న(21) అనే ఓ యువతి కరోనా టీకా కోసం జెడ్పీహెచ్ఎస్కు వెళ్లింది.
దీంతో ఆ యువతికి నర్స్ పద్మ.. ఫోన్ మాట్లాడుకుంటూ రెండు డోసుల కరోనా టీకా ఇచ్చింది. వ్యాక్సిన్ అనంతరం ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
చదవండి: COVID-19: గణనీయంగా తగ్గుతున్న రోజువారీ కేసులు
Tags