రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘తల్లీ.. మీ మాట వినడానికే వచ్చాను’
Published on Sat, 11/11/2023 - 20:11
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభలో ఓ యువతి కాసేపు అందరినీ టెన్షన్ పెట్టింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె ఫ్లడ్లైట్ స్తంభం ఎక్కింది. దీంతో పోలీసులతో పాటు అందరిలో కంగారు నెలకొనగా.. అది గమనించిన మోదీ ఆమెను వారించారు.
‘‘తల్లీ కిందకు దిగాలి. ఇది మంచిది కాదు. మీతో నేను ఉన్నాను. మీకోసమే ఇక్కడికి వచ్చాను. మీ మాట వినడానికే వచ్చాను. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మీరు మందకృష్ణ మాట వినాలి’’ అని మైక్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ప్రధాని అలా చెప్పడంతో ఆమె కిందకు దిగింది. కిందకు దిగిన ఆమెను పోలీసులు మందలించి వదిలేసినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
#
Tags