amp pages | Sakshi

నిర్లక్ష్యం వద్దు.. తగిన చికిత్స లేకుంటే దుష్పరిణామాలు

Published on Tue, 08/03/2021 - 08:35

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత ప్రభావాలు, పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. దీనితో ముడిపడిన అనారోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. కరోనా రోగులు ఏ స్థాయిలో దాని బారిన పడ్డారన్న దానిపై వారు పూర్తిగా కోలుకునే కాలం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు, పరిశోధకులు ఇదివరకే తేల్చారు. స్వల్ప, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలు, ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ, వెంటిలేటర్‌పైకి వెళ్లడం, స్టెరాయిడ్స్‌ స్థాయిల వినియోగం వంటి వాటిని బట్టి కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు నెల నుంచి ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. కీళ్లు, కండరాలు, నరాల వ్యవస్థలపై కోవిడ్‌ అనంతరం ప్రభావాలు తీవ్రంగా ఉన్నట్టు ఇప్పటికే తేలింది. తాజాగా కోవిడ్‌ రోగులు ఎముకల్లో పటుత్వాన్ని కోల్పోతున్నారని (బోన్‌ డెత్‌– అవాసు్క్యలర్‌ నెక్రోసిస్‌ (ఏవీఎన్‌)) హైదరాబాద్‌లోని ఒవైసీ ఆస్పత్రి, రీసెర్చి క్యాంపస్‌ వైద్య పరిశోధకులు డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్, డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌లు వెల్లడించారు.  
– సాక్షి, హైదరాబాద్‌

కరోనా నుంచి కోలుకునే క్రమంలో ఎముకలకు రక్తప్రసారం తగ్గి సూక్ష్మ ఫ్రాక్చర్లతో (ఎముకలు చిట్లడం) కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వైద్యులు తెలిపారు. తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మ్యుకార్‌ మైక్రోసిస్‌ మాదిరిగానే, కరోనా చికిత్సలో భాగంగా మందులు, ఔషధాలు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో ఈ రకం కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు వృద్ధులు, వయసు పైబడిన వారిలోనే కాకుండా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ ఉపయోగించిన యువతలోనూ బయటపడొచ్చునంటున్నారు. కోవిడ్‌ చికిత్స అనంతరం 50, 60 రోజుల్లో ఏవీఎన్‌ కొందరిలో బయటపడొచ్చని, మరికొందరిలో కనిపించడానికి ఆరు నెలల నుంచి ఏడాది కూడా పట్టొచ్చునని డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్, డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌ వెల్లడించారు.  

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం 
ఏవీఎన్‌కు సంబంధించిన లక్షణాలు తొలుత ఎమ్మారై పరీక్షల్లో బయటపడతాయని, తదనంతర పరిస్థితుల్లో ఎక్స్‌రే రేడియోగ్రాఫ్‌లోనూ గుర్తించొచ్చునని చెప్పారు. దీని మొదటిదశ లక్షణాల్లో భాగంగా నడుం, గజ్జలు, వెన్నెముక, భుజం నొప్పులు కనిపించొచ్చునని, వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై జాయింట్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందువల్ల తొలిదశలోనే దీనిని గుర్తించి అప్రమత్తమైతే అది తీవ్రస్థాయికి చేరకుండా అరికట్టొచ్చుని స్పష్టం చేశారు. ఎముకల జాయింట్ల నొప్పులు పెరుగుతున్నప్పుడు, ఈ నొప్పులు ఆగకుండా కొనసాగుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్‌ డాక్డర్లను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్, డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌ సూచించారు.   
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)