నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి
Published on Mon, 05/31/2021 - 11:49
గూడూరు: కాన్పు కోసం తల్లిగారింటికి వచ్చిన ఓ యువతి కరోనా బారిన పడి మృతిచెందింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ధరావత్ కొమ్మాలు, కాళీ దంపతులకు కూతురు సరిత (23)కు ఏడాది క్రితం ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.
మొదటి కాన్పు కోసం 20 రోజుల క్రితం సరితను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొమ్మాలు, కాళీ దంపతులకు కరోనా సోకింది. కొడుకు దివాకర్తోపాటు కూతురు సరితకూ వైరస్ సోకింది. దీంతో వారంతా మహబూబాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు సరితను హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఓ పాపకు జన్మనిచ్చింది. 3 రోజుల క్రితం ఆ పాప, శనివారం సరిత మృతిచెందారు.
చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో..
Tags