amp pages | Sakshi

6లోగా వరదలపై నివేదిక ఇవ్వాలి

Published on Sat, 10/29/2022 - 01:53

సాక్షి, హైదరాబాద్‌ : వరదల నివారణకు శాశ్వత చర్యలను సూచించడంతో పాటు ఏయే ప్రాంతాలను తరలించాల్సి ఉంటుందో సిఫారసు చేసేలా వరదలపై సమగ్ర నివేదికను నవంబర్‌ 6లోగా సమర్పించాలని నిపుణుల కమిటీని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ ఆదేశించారు. నవంబర్‌ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను సమర్పించి, తదుపరి ఆమోదం తీసుకుంటామని తెలిపారు. భద్రాచలం పరిసరాలు నీట మునగడానికి పోలవరం బ్యాక్‌ వాటర్‌తో పాటు ఉప నదుల ప్రవాహం సజావుగా లేకపోవడం, నిలిచి ఉన్న నీరే కారణమని నిపుణుల కమిటీ తేల్చింది.

దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్ర­శేఖరరావు ఆదేశాలతో నీటి­పారుదల­శాఖ ఈఎన్‌సీ (ఓ అండ్‌ ఎం) బి.నాగేంద్రరావు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేశారు. ప్రాథమిక అధ్యయనం అనంతరం అందులోని అంశాలపై శుక్రవారం జలసౌధలో నీటి పారుదలశాఖ రజత్‌కుమార్, ఈఎన్సీ (జనరల్‌) సి.మురళీధర్, ఈఎన్‌సీ (గజ్వేల్‌) బి.హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఏడాదిలో 8 నెలలపాటు 892 ఎకరాలు ముంపులోనే...
పోలవరం నిర్మాణం పూర్తయి...150 అడుగులు (పూర్తిస్థాయి రిజర్వాయర్‌ లెవల్‌)లో నీటిని నిల్వ చేస్తే ఏడాదిలో 8 నెలల పాటు తెలంగాణలోని 892 ఎకరాలు నీట మునుగుతాయని నిపుణులు వివరించారు. ఈ భూములను పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలోనే భాగంగానే సేకరించాలని కమిటీ తెలిపింది. పోలవరం వద్ద డ్యామ్‌ నిర్మాణం జరగని సమయంలో 25.53 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తే పోలవరం నిర్మాణంలో 2,159 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికే పరిమితమైందని

ఈ కారణంగా 103 గ్రామాల్లోనే 40వేల ఎకరాలు నీటమునగగా..28వేల మంది దీనికి ప్రభావితులయ్యారని గుర్తు చేశారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా భద్రాచలం, బూర్గంపాడు, సారపాక వంటి లోతట్టు ప్రాంతాల్లో నీటిని నిరంతరం పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని, దీని కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ అండ్‌ మెయిటెనెన్స్‌ ప్రణాళికను సిద్ధం చేయాలని వివరించారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)