amp pages | Sakshi

విద్యార్థులుంటేనే భర్తీ.. పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

Published on Fri, 07/16/2021 - 00:44

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులనే భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయకూడదని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. వీటిని ప్రభుత్వం అంగీకరిస్తే, ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్‌ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశాల్లేవు. విద్యార్థుల్లేని పాఠశాలల్లోని ఖాళీల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే విద్యార్థుల్లేని పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికనుగుణంగా పాఠశాల వి ద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాల ల్లో 2వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.

ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయి లోనే ఉన్నట్టు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 12 వేల ఉ పాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధా రణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచరుకు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మం ది, హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్యా పెరుగుతోంది.  

బదిలీలపై కసరత్తు 
రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, హేతుబద్ధీకరణపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. రెండు ప్రక్రియలు ఒకేసారి నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక హేతుబద్ధీకరణ జరగలేదు. కాబట్టి తొలిసారిగా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. హేతుబద్ధీకరణలో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్‌ పోస్టులను అటుఇటు మార్చనున్నారు. దీనిద్వారా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఎక్కువ మంది టీచర్లను పంపించడానికి, తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను కుదించడానికీ వీలుంటుంది. 

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌