amp pages | Sakshi

ఇక పాఠశాలల బాధ్యత పంచాయతీలదే!

Published on Mon, 08/24/2020 - 08:25

సాక్షి, అదిలాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకు కట్టబెట్టనున్నారు. ప్రభుత్వ బడులను స్వచ్ఛ పాఠశాలలుగా మార్చే ఉద్దేశంతో ఇన్నాళ్లు ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తున్న బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో     ప్రకటించారు. 

పాఠశాలలు మెరుగుపడే అవకాశం..
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 455, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 102 ఉన్నాయి. వీటిల్లో 65వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలల్లో నూతన సిబ్బంది నియామకాలు లేకపోవడంతో స్వీపర్లు, పారిశుధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. బడుల ఆవరణలు పిచ్చిమొక్కలు, అపరిశుభ్రతతో నిండిపోతున్నాయి. కొన్ని పాఠశాల ఆవరణల్లో పశువులు సంచారం చేస్తున్నాయి. సిబ్బంది సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. జిల్లా విద్యా శాఖ తాత్కాలిక పద్ధతిలో కొంతమంది సిబ్బందిని నియమించినా.. తక్కువ వేతనాలు కావడంతో పని చేయడానికి వారు ఆ సక్తి చూపడం లేదు. కాగా పాఠశాలల పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో స మస్య తీరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు నిర్వహణ బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చూసేవారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే..
కరోనా తగ్గుముఖం పడితే మొదట ఉన్నత పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదట డిజిటల్‌ తరగతులు, ఆ తర్వాత ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు తెరవలేదు. బడులు తెరిచిన తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలల్లో నూతన విధానం అమలు చేసి పారిశుధ్య కార్యక్రమాలు ఆయా గ్రామ పంచాయతీల ద్వారా అధికారులు నిర్వహించనున్నారు.

ఆదేశాలు రావాల్సి ఉంది
పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. పూర్తిస్థాయి ఉత్తర్వులు రావాల్సి ఉంది. పాఠశాలలు తెరుచుకునే నాటికి వచ్చే అవకాశం ఉంది. – రవీందర్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)