రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్మార్ట్ బోట్ జల ప్రవేశం.. 60 మంది ఒకేసారి
Published on Sat, 09/05/2020 - 11:38
సాక్షి, నాగార్జునసాగర్ : స్మార్ట్ బోటు శుక్రవారం జలప్రవేశం చేసింది. విశాఖపట్టణానికి చెందిన సెకాన్ కంపెనీ ఈ బోట్ను తయారు చేసింది. అక్కడినుంచి లారీలో తెచ్చిన బోటును దయ్యాలగండి సమీపంలోని సమ్మక్క–సారక్క పుష్కరఘాట్నుంచి నీటి ఒడ్డున దింపారు. అనంతరం రబ్బరు ట్యూబులను బోట్ కింది భాగంలో అమర్చి వాటిలోకి గాలి నింపారు. నాలుగు ట్యూబ్లను పెట్టి ముందు దాంట్లో గాలి తక్కువగా ఉంచుతూ వెనుక భాగంలోని ట్యూబ్లోకి గాలి ఎక్కువగా పంపడంతో బోట్ ముందుకు జరుగుతూ వచ్చి నీటిలోకి జారేలా చేశారు. అనంతరం మరో లాంచీ వచ్చి దూరంగా నిలబడి తాడు సాయంతో ఈ బోట్ను నీటిలోకి లాగింది. జలాశయంలోకి దిగిన అనంతరం లాంచీ స్టేషన్కు తీసుకుపోయారు. ఈ స్మార్ట్బోట్లో 60 మంది పర్యాటకులు ప్రయాణం చేయవచ్చు.
#
Tags