amp pages | Sakshi

ఎంఐఎం కోసమే గ్రూప్‌–1లో ఉర్దూ

Published on Tue, 05/10/2022 - 01:47

జడ్చర్ల/జడ్చర్లటౌన్‌: గ్రూప్‌–1లో ఉర్దూలో పరీక్షరాసి ఉద్యోగాలు పొందిన వారిని తాము అధికారంలోకి రాగానే న్యాయపరమైన ప్రక్రియ ద్వారా తొలగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని కోడ్గల్‌ సమీపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎంఐఎం మెప్పు కోసమే సీఎం కేసీఆర్‌ గ్రూప్‌–1 పరీక్షలో ఉర్దూ భాషను చేర్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను ఎంఐఎం పార్టీకి అమ్ముకుంటోందని విమర్శించారు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై మాట్లాడే అర్హత లేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్నారు.

ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, వారి మధ్య పొత్తు కుదిరిందని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు ఈ అంశంపై చర్చిద్దామంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చిందని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్ర–2 ముగింపు సభతో చరిత్ర సృష్టించబోతున్నామన్నారు.   

ఉమ్మడి పాలమూరులో ముగిసిన యాత్ర   
బీజేíపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం రాత్రి ముగిసింది. ఏప్రిల్‌ 14న జోగుళాంబ గద్వాల జిల్లాలో జోగుళాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉమ్మడి జిల్లాలో 26 రోజుల పాటు 326కి.మీ.మేర కొనసాగి, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఎక్వాయపల్లిలో ముగిసింది. పెద్ద ఆదిరాలలో రచ్చబండ నిర్వహించిన అనంతరం సంజయ్‌ ఎక్వాయపల్లి దాటి రంగారెడ్డి జిల్లా తొమ్మిదిరేకులలో బసచేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది.

రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలవాలి 
రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలిచేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. భారీగా జన సమీకరణ ద్వారా తెలంగాణలో సరికొత్త చరిత్రను సృష్టిద్దామని చెప్పారు.

‘ప్రజా సంగ్రామ యాత్ర–2’ముగింపు సందర్భంగా ఈ నెల 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహిస్తున్న అమిత్‌షా సభ ఏర్పాట్లపై సోమవారం జడ్చర్ల మండలం మక్తపల్లి గేట్‌ వద్ద సంజయ్‌ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఒక్కో డివిజన్‌ నుంచి వేలాది మంది ప్రజలు ముగింపు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. 

Videos

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)