amp pages | Sakshi

1 నుంచి ‘మెడికల్‌’ క్లాసులు 

Published on Sat, 01/16/2021 - 08:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతుల షెడ్యూల్‌ ఖరారైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తున్నందున కాలేజీలను తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని మెడికల్‌ కాలేజీలను విశ్వవిద్యాలయం ఆదేశించింది. అయితే రెండో ఏడాది నుంచి చివరి ఏడాది వరకు వైద్య విద్య తరగతుల ప్రారంభం ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా నిర్ణయం జరగలేదు. వాస్తవానికి డిసెంబర్‌ 1 నుంచే తరగతులు నిర్వహించాలని ఎన్‌ఎంసీ రాష్ట్రాలను ఆదేశించింది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఆ మేరకు తరగతులు ప్రారంభమయ్యాయి. చదవండి: విక్రమ్‌కు ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ ఇవ్వండి 

కానీ రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆసక్తి కనబరచకపోవడం, కరోనా నేపథ్యంలో సర్కారు వెనకడుగు వేయడంతో ఇప్పటివరకు రెండో ఏడాది ఆపై విద్యార్థుల తరగతులను ప్రారంభించలేదు. అయితే 9వ తరగతి నుంచి జూనియర్‌ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యకు సంబంధించి కాలేజీలు ఒకటో తేదీ నుంచి తెరుచుకోవడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాది, ఆపై వైద్య విద్య తరగతుల విషయంపై రాష్ట్ర సర్కారు ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే మెడికల్‌ కాలేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపించామని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నాయి. ఆయా తరగతులు కూడా మొదటి ఏడాది వైద్య విద్య తరగతులతోనే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాళోజీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే..

మొత్తం 55 వేల మంది విద్యార్థులు... 
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 55 వేల మంది ఉంటారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. 33 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థుల సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారు. మరో 20 వేల మంది నర్సింగ్‌ విద్యార్థులు, 6 వేల మంది డెంటల్‌ విద్యార్థులు, 5 వేల మంది పిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్‌ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని తెలిపింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 5,040 మంది ఉంటారని విశ్వవిద్యాలయం పేర్కొంది. 

కరోనా టెస్టులు చేశాకే అనుమతి... 
మెడికల్‌ కాలేజీల పునఃప్రారంభం నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కాలేజీలు తెరిచాక పాటించాల్సిన నిబంధనలు, దానికి ముందు చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీచేసింది. కరోనాతో గతేడాది మార్చి నుంచి మెడికల్‌ కాలేజీలన్నీ మూతబడ్డాయి. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. అకడమిక్‌ షెడ్యూల్‌ ప్రకారం అన్ని థియరీ క్లాసులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాక్టికల్, క్లినికల్‌ క్లాసులు నిర్వహించడానికి, చివరి సంవత్సరం విద్యార్థుల కోసం కాలేజీలను ప్రధానంగా తెరవాల్సి ఉంది. 

మార్గదర్శకాలు ఇవి...
► కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉన్న వారినే కాలేజీల్లోకి అనుమతించాలి. ఆర్టీ–పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి. 
► జలుబు, దగ్గు, శ్వాస సంబంధ లక్షణాలుంటే కాలేజీలోకి అనుమతించొద్దు. 
► తమ అనుమతితోనే పిల్లలను పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు లిఖితపూర్వక లేఖ ఇవ్వాలి.  
► విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. ఉమ్మివేయడం నిషేధం. 
► కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను విద్యార్థులు తమ మొబైల్‌ ఫోన్లలో ఉపయోగించాలి.  
► ప్రతి కాలేజీలో టాస్క్‌ఫోర్స్‌ లేదా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ టీంను ఏర్పాటు చేసుకోవాలి. 
► రెండు షిఫ్టులుగా లేదా రొటేషన్‌ పద్ధతిలో ప్రాక్టికల్స్, థియరీ తరగతులు నిర్వహించాలి.  
► థియరీ క్లాసులను ఆన్‌లైన్‌ ద్వారా నడిపించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కరోనా వ్యాప్తి తగ్గే వరకు దీన్ని కొనసాగించాలి. విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించాలి.  
 హాస్టల్‌ గదుల్లో ఒకరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి.  
► మెస్‌లో టైం స్లాట్‌ ప్రకారం విద్యార్థులకు భోజన, అల్పాహారం ఏర్పాట్లు చేయాలి.  
►  విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)