amp pages | Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పాత కేసులపై పోలీసుల దృష్టి

Published on Wed, 01/20/2021 - 20:47

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ కేసుల పరిష్కారం మళ్లీ వేగం పుంజుకోనుంది. వివిధ కారణాలతో దశాబ్దాలుగా నిలిచిపోయిన పాత కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి ఆదేశాలతో అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీస్‌ శాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 2019 ఆగస్టు నుంచి పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో రంగంలోకి దిగారు. గతేడాది మార్చి వరకు పెండింగ్‌ కేసుల పరిష్కారం బాగానే సాగినా.. ఆ తర్వాత కరోనా కారణంగా నెమ్మదించాయి. గతేడాది జనవరి ఆఖరిలోగా పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌పై నివేదిక ఇవ్వాల్సి ఉన్నా లాక్‌డౌన్‌తో బ్రేక్‌ పడింది. ఇపుడు మళ్ళీ క్రమంగా పాత పరిస్థితులు నెలకొనడంతో తిరిగి కేసుల పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు.(చదవండి: 'ఆయన మృతికి వ్యాక్సిన్‌ కారణం కాదు')

నేరస్తుల అప్పగింతతో..  
నేరం ఆలస్యంగా వెలుగు చూడటం, నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోవడం, బెయిల్‌ అనంతరం అదృశ్యమవడం తదితర కారణాల వల్ల కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇలా రకరకాల కారణాలతో 1990 నుంచి 2018 వరకు రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో చాలామటుకు కేసుల్ని పోలీసులు క్లియర్‌ చేశారు. ఏడాదిన్నర కింద జరిగిన దక్షిణ భారత(సదరన్‌) డీజీల సదస్సులో రాష్ట్రాల మధ్య నేరస్థుల అప్పగింత ప్రస్తావన వచ్చింది. ఒక రాష్ట్రంలో నేరానికి పాల్పడి మరో రాష్ట్రంలో ఊరు, పేరు మార్చుకున్న వారిని అప్పగించేందుకు అందరూ సుముఖం వ్యక్తం చేశారు. ఇది కూడా నిందితులను వెంటనే స్వరాష్ట్రానికి తరలించి, కేసును పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో 20 ఏళ్లనాటి పెండింగ్‌ వారెంట్లలోనూ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతమవుతున్నారు. 

నాలుగేళ్లుగా కరీంనగర్‌ టాప్‌! 
పెండింగ్‌ కేసుల పరిష్కారంలో కరీంనగర్‌ కమిషనరేట్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంటూ మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇదే విషయమై తాజాగా సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. ఇక కేసుల పరిష్కారంలో రెండో స్థానంలో మహబూబ్‌నగర్‌ ఉండగా తర్వాత వరుసగా నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, రామగుండం కమిషనరేట్లు నిలిచాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)