amp pages | Sakshi

సాహితీవేత్త కేకే రంగనాథాచార్యులు కన్నుమూత

Published on Sun, 05/16/2021 - 08:54

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సాహితీ విమర్శకులు, భాషావేత్త, చరిత్రకారులు ఆచార్య కేకే రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో తార్నాకలో కన్నుమూశారు. కొద్ది రోజులక్రితం ఆయన కరోనా బారిన పడ్డారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శనివారం మృతిచెందారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య ఊర్మిళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులుగా పేరు పొందిన రంగనాథాచార్యులు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించారు.

తెలుగు, సంస్కృత భాషల్లో పలు పరిశోధనలు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్‌గానూ పనిచేశారు. సాహిత్య విమర్శకులు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు కృషి చేశారు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ల సన్నిహిత మిత్రుడిగా దిగంబర కవుల సంచలనానికి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. 1970 జూలై 4వ తేదీన విరసం ఆవిర్భావ ప్రకటనపైన సంతకం చేసిన పద్నాలుగు మందిలో ‘రంగనాథం’అనే సంతకం ఆయనదే. రంగనాథాచార్యులు అనేక గ్రంథాలను రాశారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు సాహిత్య వికాసం, నూరేళ్ల తెలుగునాడు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, తెలుగు సాహిత్యం మరో చూపు, తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం ఆయన కలంనుంచి వెలువడినవే. ఆయన మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత కోడం కుమార్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం 
భాషా సాహితీవేత్త, విమర్శకులు ఆచార్య కేకే రంగనాథాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య వికాసానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

తెలుగు సాహిత్య వికాసానికి ఎనలేని సేవలు
తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఆచార్య రంగనాథాచార్యులు మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు, తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి కుటుంబానికి హరీశ్‌రావు, గోరటి వెంకన్న ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

57 ఏళ్ల స్నేహబంధం తెగిపోయింది
రంగనాథాచార్యులు మరణంతో తమ 57 ఏళ్ల ఆత్మీ య స్నేహబంధం తెగిపోయిందని ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. సంస్కృతం, తెలుగు, హిందీ భాషాశాస్త్రాల్లో ఆయ న విద్వత్తు సాధించారని, దిగంబరకవులుగా ఆయ న తాత్విక సాహిత్యయాత్ర కొనసాగిందని తెలి పారు. విప్లవ, సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో దశాబ్దాల పాటు వెంట నడిచిన సన్నిహిత మిత్రులు జ్వాలాముఖి మరణం తర్వాత తమకు ఇదే పెద్ద విషాదమని నిఖిలేశ్వర్‌ ఆవేదన వెలిబుచ్చారు.
చదవండి: బ్లాక్‌ ఫంగస్‌తో అప్రమత్తం!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)