amp pages | Sakshi

అమ్మో.. డ్యూటీనా?

Published on Sat, 08/29/2020 - 03:59

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు భయం పట్టుకుంది. అన్‌లాక్‌– 4లో భాగంగా కేంద్రప్రభుత్వం మెట్రో రైళ్లు నడిపేందుకు పచ్చజెండా ఊపనుందనే సమాచారమే వారి ఆందోళనకు కారణం. మెట్రో రైళ్లు నడిపితే హైదరాబాద్‌లో సిటీ బస్సులు కూడా ప్రారంభించే అవకాశముం టుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుం డటంతో వారి గుండెల్లో దడ మొదలైంది. బస్సులు ప్రారంభమైతే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, తామూ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని ఎక్కువ మంది భయపడుతున్నారు. 

నగరంలోనే కేసులెక్కువ..
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600 మందికిపైగా ఆర్టీసీ సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో దాదాపు 40 మంది వరకు చనిపోయారని కార్మిక సంఘాలు పేర్కొంటు న్నాయి. అయితే నగరంలో సిటీ బస్సులు నడపనప్పటికీ, ఇక్కడే ఎక్కువ మంది కోవిడ్‌ బారిన పడటం గమనార్హం. బస్సులు  తిరగకున్నా రొటేషన్‌ పద్ధతిలో విధులకు హాజరవుతున్నారు. జిల్లాలతో పోలిస్తే నగరంలో డిపోలు ఇరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం బస్సులు డిపోలకే పరిమితం కావ టంతో నిలబడేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఇదే సమస్యకు కారణమవు తోంది. హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, బయట వైరస్‌ సోకిన ఉద్యోగి విధులకు హాజరైతే వారి ద్వారా తోటి ఉద్యోగులు దాని బారిన పడుతున్నారు. ఫలితంగా జిల్లాలతో పోలిస్తే నగరంలోనే కోవిడ్‌ బారిన పడ్డ ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చనిపోతున్నవారిలో కూడా ఇక్కడే ఎక్కువ నమోదవటం విశేషం. ఈ నేపథ్యంలోనే  సిటీ బస్సులు ప్రారంభిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని సిబ్బంది తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 

55 ఏళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువే..
ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ల సంఖ్యే ఎక్కువ. వీరిలో 55 ఏళ్ల పైబడ్డవారు రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది ఉన్నారు. వీరిలో 13 వేల మంది నగరంలోనే ఉన్నారు. కరోనా బారిన పడి చనిపోతున్నవారిలో ఈ వయసు వారే ఎక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఒకవేళ సిటీ సర్వీసులు ప్రారంభమైతే  వారంతా సెలవు పెట్టాలని భావిస్తున్నారు.

ఇక్కడ రద్దీ ఉండే అవకాశం..
ప్రస్తుతం జిల్లాల్లో నడుస్తున్న బస్సులు చాలావరకు ఖాళీగానే తిరుగుతున్నాయి. కానీ, నగరంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. నగరంలో రోడ్లన్నీ ట్రాఫిక్‌ రద్దీతో దర్శనమిస్తున్నాయి. బస్సులు ప్రారంభమైతే అవి రద్దీగానే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అయితే మెట్రో రైళ్లు ప్రారంభించాల్సిన పరిస్థితి ఉన్నా, సిటీ బస్సులు ప్రారంభించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌