amp pages | Sakshi

కాళ్లు మొక్కుతా.. మద్దతు ఇవ్వండి

Published on Sun, 01/24/2021 - 12:01

‘మీ కాళ్లు మొక్కుతా సారు. పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించుండ్రి. పసుపు పండించి ఏటా నష్టపోతున్నాం. చేసిన కష్టానికి ఫలితం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా అత్తలేదు. పసుపు పండించమంటేనే భయమైతుంది. రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మా పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోండి సారు.. రూ.15 వేలు కాకపోయినా కనీసం రూ.10 వేల మద్దతు ధర వచ్చేలా చూడుండ్రి’  రైతులతో ఎంపీ ముఖాముఖి కార్యక్రమంలో మోతెకు చెందిన రైతు సంజీవ్‌ ఆవేదన ఇది. సమావేశంలో ఆయన అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, తన గోడు వెల్లబోసుకున్నాడు. రైతుల దయనీయ స్థితిని వివరిస్తూ పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించాలని వేడుకున్నాడు.  

మోర్తాడ్‌(బాల్కొండ): చర్చలు ఫలించలేదు.. రైతుల ఆశలు తీరలేదు.. పసుపుబోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర ప్రధాన ఎజెండాగా సాగిన రైతు అభ్యర్థులతో ఎంపీ అర్వింద్‌ ముఖాముఖి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎటూ తేల్చకుండానే ఈ కార్యక్రమం అసంపూర్తిగా ముగిసింది. అయితే, రైతుల ఆవేదన వెల్లబోసుకునేందుకు ‘ముఖాముఖి’ వేదికైంది. పంట సాగుకు పెడుతున్న పెట్టుబడులు, తాము పడుతున్న కష్టాలు, తమకు వస్తున్న నష్టాలను కళ్ల కు కట్టినట్లు కర్షకులు వివరించారు. కాళ్లు మొక్కుతామని, తమ కష్టాలు తీర్చాలని ప్రాధేయపడ్డా రు. అయితే, పసుపు పంటకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉండదన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదనలు పంపిస్తే న్యాయం చేస్తామని తెలిపారు. అయితే, గతంలో ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో పసుపుబోర్డు తేవాలని, లేకుంటే పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశా రు. ఈ క్రమంలో వాడివేడీగా వాదనలు సాగాయి. ఎటూ తేల్చకుండానే చర్చలు ముగిశాయి.

ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ అర్వింద్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వాగ్వాదం

తరలి వచ్చిన రైతు అభ్యర్థులు.. 
పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు మద్దతు ధర కోసం ఏళ్లుగా పోరాడుతున్న రైతులు.. 2019 లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. నిజామాబాద్‌ స్థానం నుంచి 178 మంది రైతులు పోటీలో నిలిచి దేశ వ్యాప్త చర్చకు అవకాశమిచ్చా రు. అయితే, ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కా వొస్తున్నా పసుపుబోర్డు ఏర్పాటు కాకపోవడం, మ ద్దతు ధర లభించక పోవడంతో రైతులు మరోమా రు ఉద్యమాన్ని లేవదీశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రైతు అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌లో హాల్‌లో శనివారం సమావేశమయ్యారు. మన జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులు తరలి వచ్చారు. 

బోర్డు, మద్దతు ధర కావాలి.. 
రాజకీయ పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ ముఖాముఖిలో ఎంపీ అభ్యర్థులు.. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని, రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటుపై బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చిన విషయాన్ని రైతులు పదే పదే గుర్తు చేశారు. 

హామీకి కట్టుబడి ఉన్నానన్న ఎంపీ.. 
అయితే, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. తాను ఎన్నికైన వెంటనే పసుపుబోర్డుకు మించి సేవలందించే స్పైసిస్‌బోర్డు, ఇతర పథకాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని వివరించారు. 2019 మే చివరి వారంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టగా, జూన్‌ నెలలోనే తన పని తాను మొదలు పెట్టానని తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయెల్, హోం మంత్రి అమిత్‌షాలను సంప్రదించి స్పైసిస్‌బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని సాధించామని వివరించారు. పసుపు ధర పెరగాలంటే దళారీ వ్యవస్థ ఉండకూడదని, ఇందుకోసం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామని చెప్పారు. ప్రాంతీయ పంటలకు మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తే అవసరమైన కార్యాచరణ అమలు చేయడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అంగీకరించని రైతులు.. 
అయితే, ఎంపీ చెప్పిన అంశాలను రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటన రెండే అంశాలను ఎజెండాగా తాము చర్చలకు వచ్చామని, వీటిపై స్పష్టత ఇవ్వకుండా ఇతర అంశాలను చర్చించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీకి, రైతు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పలు సందర్భాల్లో రైతులు జై జవాన్‌.. జై కిసాన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్‌ సమావేశం నుంచి వెళ్లి పోయారు. చర్చలు విఫలమయ్యాయని, పసుపుబోర్డు, మద్దతు ధరపై స్పష్టత రాలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)