amp pages | Sakshi

తెలంగాణలో ఒమిక్రాన్‌ కలవరం.. ఒకే రోజు 14 కేసులు 

Published on Wed, 12/22/2021 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 14 మం దిలో రిస్క్‌ దేశంగా గుర్తించిన యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు ఇద్దరుండగా.. నాన్‌ రిస్క్‌ దేశాలుగా పేర్కొన్న కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా 11 మంది పురుషులున్నారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల సంఖ్య 38కి చేరింది. మొత్తం 38 కేసుల్లో 31 మంది నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఆరుగురు రిస్క్‌ దేశాల నుంచి రాగా.. తొలిసారిగా ఒక రికి తెలంగాణలో ఒమిక్రాన్‌ సోకింది.  

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు 4 కేసులు
 నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వస్తున్న వారిలో కేవలం 2% మందికే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. మిగతా వారికి టెస్టులు చేయడం లేదు. టెస్టులు చేసిన వారిని కూడా ఫలితం వచ్చే వరకు ఉంచకుండా కేవలం శాంపిల్స్‌ సేకరించి పంపేస్తున్నారు. ఈ విధంగా బయటకు వస్తున్న వారిలో ఎంతమందికి ఒమిక్రాన్‌ సోకి ఉంటుందో, వారెంత మందికి వ్యాపింపజేసి ఉంటారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇలావుండగా.. తాజాగా నమోదైన 14 కేసుల్లో ఆరుగురి ఆచూకీ ఇంకా కనిపెట్టలేదని సమాచారం. ఇక బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన 259 మంది ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో నలుగురికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉందా లేదా అని నిర్ధారించేందుకు నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు రిస్క్‌ దేశాల నుంచి 9,381 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు.  

కొత్తగా 182 కరోనా కేసులు 
రాష్ట్రంలో కొత్తగా 182 కోవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,074కు పెరిగింది. మహమ్మారి కారణంగా ఒకరు మరణించగా మొత్తం మృతుల సంక్య 4,017కు చేరింది. తాజాగా 196 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా... మొత్తంగా 6,72,447 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారు.

Videos

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?