13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

28 Feb, 2015 13:10 IST|Sakshi

కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరికొంత మంది తప్పించుకుని పారిపోయారు. వీరి నుంచి 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా  తమిళనాడుకు చెందినవారు. స్మగ్లర్లను పట్టుకునే సమయంలో పోలీసులపైకి రాళ్లు, రంపాలతో దాడికి దిగారు.
(రైల్వేకోడూరు)

 

మరిన్ని వార్తలు