స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

26 Feb, 2015 12:37 IST|Sakshi

మండవల్లి(కృష్ణా): రెండేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండవల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు... మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామానికి చెందిన రాఘవులు అనే వ్యక్తి తన కూతురును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తన కొడుకు నవీన్(2)తో కలిసి వచ్చాడు. కుమార్తెను బస్సు ఎక్కించే క్రమంలో నవీన్‌ను తండ్రి గమనించలేదు. అక్కడే అడుకుంటున్న నవీన్ ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సు చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు