ఏపీలో కొత్తగా 246 పాజిటివ్‌ కేసులు

15 Jun, 2020 14:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 246 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,173 పరీక్షలు చేయగా.. వారిలో 246 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5087​కి చేరింది. తాజాగా రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మృత్యుల సంఖ్య 86కి పెరిగింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 2770 మంది బాధితులు కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2231 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మరోవైపు వైరస్‌ నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. (24 గంటల్లో 11,502 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు