అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారుల పరారీ

29 Jun, 2015 16:28 IST|Sakshi

కృష్ణా: కృష్ణా జిల్లాలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారులు పరారీ అయ్యారు. పారిపోయిన ఆ ఎనిమిది మంది చిన్నారులు గన్నవరంలోని స్థానికుల సంరక్షణలో ఉంటున్నారు. అయితే నిర్వాహకులు తరచూ కొట్టడం వల్లే పరారయ్యామని చిన్నారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు