Kakinada Road Accident: ఒక బైక్‌పై అతివేగంతో నలుగురి ప్రయాణం.. ప్రమాదంలో ముగ్గురి మృతి

13 Nov, 2023 15:33 IST|Sakshi

సాక్షి, క్రైమ్‌: కాకినాడ జిల్లాలో నిర్లక్ష్యం ముగ్గురి జీవితాల్ని బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్‌ సెంటర్‌ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో  వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు. 

మరిన్ని వార్తలు