-

బాధపడటానికి ఇంకేముంది: బొత్స

4 Oct, 2013 09:19 IST|Sakshi
బాధపడటానికి ఇంకేముంది: బొత్స

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ నోట్ కేంద్ర కేబినెట్ ముందుకు రావటంపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. "మేమంతా అంపశయ్యపై ఉన్నాం... ఈ విషయంలో ఇంకేం చెబుతాం... బాధపడటానికి ఇంకేముంది'' అంటూ తన నిస్సహాయతను వెలిబుచ్చారు. తెలంగాణకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి వస్తే సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా కలిసికట్టుగా తీర్మానాన్ని ఓడిస్తామని ఆయన చెప్పారు.

కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు బొత్సను మీడియా పలకరించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి విభజన నిర్ణయం వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతకు ముందు బొత్స...ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీ, కావూరి సాంబశివరావుతో సమావేశం అయ్యారు.

మరిన్ని వార్తలు