'ప్రత్యేక హోదాపై డ్రామాలా?'

4 Oct, 2015 16:03 IST|Sakshi

అనంతపురం: ప్రత్యేక హోదా పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనని మభ్యపెడుతున్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో రైతులు బతికే పరిస్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కరువు పరిస్థితుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు